|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 09:33 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో శతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో మెరిసిన కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్లో 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా అతనికి ఇది 84వ అంతర్జాతీయ శతకం. మొత్తం 93 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు.యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి మూడో వికెట్కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సార్లు (32 సార్లు) 150 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది.కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. చివర్లో కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది
Latest News