|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:08 PM
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. విజయన్ తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు సమీకరించే ప్రభుత్వ సంస్థ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్ బీ) 2019లో జారీ చేసిన మసాలా బాండ్ల వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది. నిధుల సేకరణలో ఫెమా మార్గదర్శకాలను పాటించలేదన్న ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News