|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 09:26 PM
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ అభిమానులకు షాకిచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో జరగనున్న మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఓ కొత్త సవాలును స్వీకరించనున్నట్లు ప్రకటించాడు.గత 14 సీజన్లుగా ఐపీఎల్లో కొనసాగుతున్న డుప్లెసిస్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సుదీర్ఘ అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గానూ వ్యవహరించాడు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి, అక్షర్ పటేల్కు డిప్యూటీగా ఉన్నాడు. అయితే, వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసింది.ఈ నిర్ణయంపై డుప్లెసిస్ ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన విడుదల చేశాడు. 14 సీజన్ల తర్వాత, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఈ లీగ్ నా ప్రయాణంలో ఓ ముఖ్యమైన భాగం. భారత్ నాకు స్నేహాలను, మధురమైన జ్ఞాపకాలను ఇచ్చింది. ఇది వీడ్కోలు కాదు. మళ్లీ కలుస్తాను అని పేర్కొన్నాడు.ఈ ఏడాది ఓ కొత్త సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నా. రాబోయే పీఎస్ఎల్ సీజన్లో ఆడబోతున్నా. కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త సవాల్. పాకిస్థాన్ ఆతిథ్యం కోసం ఎదురుచూస్తున్నా అని డుప్లెసిస్ తన ప్రకటనలో తెలిపాడు. కాగా, ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.
Latest News