|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 12:16 PM
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తాము కోరిన కోర్కెలు తీర్చాలని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
Latest News