|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 07:58 PM
రాష్ట్రవ్యాప్తంగా 'యోగాంధ్ర' కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. యోగాంధ్రను ఇంతటి విజయవంతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అందించిన సహకారం, వారి కృషి ఎనలేనిదని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.విశాఖపట్నం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఒక అరుదైన రికార్డును నెలకొల్పిందని మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. కేవలం విశాఖపట్నంలోనే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ఉత్సాహంగా యోగాసనాల్లో పాలుపంచుకున్నారని మంత్రి తెలిపారు. దాదాపు రెండు కోట్లకు పైగా ప్రజలు యోగాంధ్రలో పాల్గొని ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారని ఆయన వివరించారు. ఈ అపూర్వ స్పందన యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తోందని అనగాని సత్యప్రసాద్ అన్నారు
Latest News