కొనసాగుతున్న విమాన ప్రమాదం మృతుల గుర్తింపు ప్రక్రియ
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:46 PM

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి వారం రోజులు కావస్తున్నా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మృతదేహాలు చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో అధికారులకు ఇది పెద్ద సవాలుగా మారింది.ఈ విషయంపై అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేశ్ జోషి మాట్లాడుతూ, డీఎన్‌ఏ నమూనాల పరీక్షల ద్వారా ఇప్పటివరకు 215 మంది మృతులను గుర్తించినట్లు శుక్రవారం తెలిపారు. వీరిలో 198 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ, అప్పగింతలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు ఛిద్రమై, తీవ్రంగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల ఎముకలలోని కణజాలం నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని, ఈ ప్రక్రియ సంక్లిష్టమైనది కావడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆయ‌న‌ వివరించారు. అహ్మదాబాద్‌లోని డీఎన్‌ఏ ప్రయోగశాల సిబ్బంది ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 24 గంటలూ నిర్విరామంగా పనిచేస్తున్నారు. మిగిలిన మృతులను కూడా త్వరితగతిన గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

Latest News
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM
Fridge blast kills two in Telangana; separate mishaps claim more lives Sun, Apr 05, 2026, 05:34 PM
US rescues missing fighter jet pilot in Iran, confirms Trump Sun, Apr 05, 2026, 05:13 PM
Pakistan's military behaves more like mercenary force Sun, Apr 05, 2026, 05:10 PM
GT will rue lost opportunities when playoff race heats up: Steyn Sun, Apr 05, 2026, 05:07 PM