|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:46 AM
తమిళనాడు సముద్ర తీరంలో ఓ అరుదైన, వింతైన చేప మత్స్యకారుల వలకు చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 30 అడుగుల పొడవున్న ఈ చేపను 'ఓర్ ఫిష్' అని పిలుస్తారు. సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు. అయితే, ఈ చేప దర్శనం అరిష్టాలకు, ముఖ్యంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో, ఈ నెల ఆరంభంలో పట్టుబడిన ఈ 'ప్రళయ చేప' వార్త స్థానికులతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర భయాందోళనలకు దారితీసింది.
Latest News