|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:27 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే దిశగా అడుగులు వేసిందని సత్యకుమార్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో ఆరోగ్యశాఖ చేపట్టిన కార్యక్రమాలు, ప్రయత్నాలు, ఫలితాలకు సంబంధించిన వివరాలను ఆయన ఐదు పేజీల నివేదిక ద్వారా సీఎం చంద్రబాబుకు అందించారు. ప్రభుత్వ వైద్య రంగంలో భాగస్వాములైన అందరూ జవాబుదారీతనం, క్రమశిక్షణలతో వ్యవహరించి.. మెరుగైన వైద్య సేవలందించేందుకు ఏడాది కాలంగా కృషి చేసినట్లు తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
Latest News