అహ్మదాబాద్ నగరంలో కూలిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
 

by Suryaa Desk | Thu, Jun 12, 2025, 05:50 PM

లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నగరంలో కూలిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని ఆయన తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలింది. ఇందులో 242 మంది ఉండగా, వారిలో 53 మంది బ్రిటన్ పౌరులే.ఈ ఘటనపై కీర్ స్టార్మర్ 'ఎక్స్' ద్వారా స్పందించారు. "భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో, లండన్ బయల్దేరిన విమానం కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ విమానంలో అనేక మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు వివరిస్తున్నారు. ఈ తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అండగా ఉంటాయి" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Latest News
IANS Year Ender 2025: Inside India's final battle against Naxalism Sat, Dec 27, 2025, 04:29 PM
Very grateful, all credit to my team: Harmanpreet on becoming captain with most wins in women's T20Is Sat, Dec 27, 2025, 04:26 PM
Study finds risk-based approach better for breast cancer screening Sat, Dec 27, 2025, 04:24 PM
Rare earth manufacturing scheme to strengthen self-reliance for India's critical sectors Sat, Dec 27, 2025, 04:23 PM
Bangladesh: Tarique Rahman registers as voter, Awami League questions process Sat, Dec 27, 2025, 04:22 PM