![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:12 PM
వాయువ్య ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్.. మధ్య ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో పలు చోట్లు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడ వద్దని సూచించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతతో పాటు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రేపు అంటే.. బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందంది.
Latest News