![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:54 PM
ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలపై చేయి వేయాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకురావాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న రెండు అత్యాచార ఘటనలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం కేసులకు సంబంధించి విచారణ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పక్కా ఆధారాల సేకరణతో నిర్దిష్ట సమయంలో నిందితులకు శిక్షపడేలా చూడాలని ఆదేశించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని, గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలని స్పష్టం చేశారు. ఇక ఈ రెండు ఘటనల్లో దర్యాప్తు, చర్యల వివరాలను సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా డీజీపీ, ఉన్నతాధికారులు వివరించారు.
Latest News