![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:10 PM
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కూటమి ఏడాది పాలన’ను రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకలు గురువారం సాయంత్రం జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు పాల్గొననున్నారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత శాఖలను ఆదేశించింది. అమరావతిలో ఈనెల 12న జరిగే ఎన్డీఏ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని, ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. రానున్న నాలుగేళ్ల పాలనకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో సూచించారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కూడా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.