![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:08 PM
ఎన్డీఏ కూటమికి ప్రజలు మంచి విజయాన్ని అందించారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి సుపరిపాలన, ధృడమైన నాయకత్వంతో మంచి పాలన అందిస్తున్నారని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ కేవలం అభివృద్ధి చెందిన భారత దేశమే కాదు ప్రతి సామాజిక వర్గం ఎదుగుదల ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.ఇవాళ (మంగళవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు. సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్తో అన్ని లక్ష్యాలని చేదించాలని ఉద్దేశంతో మోదీ పాలన ఉంటుందని వివరించారు. దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి బీజేపీని గెలిపిస్తున్నారని చెప్పుకొచ్చారు.
Latest News