![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 06:51 PM
ఆంధ్రప్రదేశ్లో గంజాయి ముఠాలను నియంత్రించేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు నేరగాళ్లపై నియంత్రణ కొరవడిందని, గంజాయి, డ్రగ్స్ వినియోగంతో చట్టం పట్ల భయం తగ్గిపోయిందని ఆయన విమర్శించారు.
మహిళలపై క్షణికావేశంతో లేదా గంజాయి మత్తులో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్ష తప్పదనే భావనను కలిగించాలని సీఎం సూచించారు. నేర నియంత్రణలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.