![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 04:32 PM
అమరావతి మహిళలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా నిరసించారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి ఇబ్బంది ఏమిటని ఆమె సజ్జలను ప్రశ్నించారు.
"వైసీపీ నేతలు తమ తప్పులను మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తున్నారు. వైఎస్ జగన్ మహిళలను 'నా అక్కాచెల్లెళ్లు' అని సంబోధిస్తారు, కానీ సొంత చెల్లెలికే గౌరవం ఇవ్వని వారు రాష్ట్రంలోని ఇతర మహిళలకు ఏమి మర్యాద ఇస్తారు?" అని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని, వైసీపీ నాయకత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.