![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 03:55 PM
అమరావతి మహిళలపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పడానికి ఇబ్బందేంటి? అని ఆమె నిలదీశారు."YCP నేతలు చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. 'మహిళలు.. నా అక్కాచెల్లెళ్లు' అని జగన్ అంటారు. కానీ ఆయన సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదు. ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారు?" అని షర్మిల ప్రశ్నించారు.
Latest News