![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 02:56 PM
విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఎంపీజే నాయకులు మంగళవారం తహసిల్దార్ గంగయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీజే పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాషా మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 'విద్యా కానుక', 'తల్లికి వందనం' పథకాలను తక్షణం అమలు చేయాలని కోరారు.
అలాగే, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, గత ప్రభుత్వంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.