![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 02:50 PM
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారని చెప్పారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2027 చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు.