![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:47 PM
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నిజాయితీపరుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు.పార్వతీపురం మన్యం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె... జూన్ 6వ తేదీన సాక్షి టీవీలో వచ్చిన కేఎస్సార్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలకు... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షికి సంబంధం లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా వాటిని వైయస్ జగన్కి, ఆయన సతీమణి వైయస్ భారతికి ఆపాదించి వికృత రాజకీయాలకు తెరదీశారని మండిపడ్డారు. తమ వాదనను నిజమని సమర్థించుకునేందుకు, ప్రజలను నమ్మించేందుకు ఒక ప్రణాలికను రూపొందించారని చెప్పారు. మొదట తెలుగుదేశం పార్టీ అఫిషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వేయించి తర్వాత నారా లోకేష్ తో రాయించి, ఆ వెంటనే సీఎం చంద్రబాబుతో పోస్టులు చేయించారన్నారు. ఆ వెంటనే జనసేన నుంచి ప్రెస్ నోట్, పవన్ కళ్యాణ్ తో ట్వీట్ వేయించి... ఒక పథకం ప్రకారం అబద్ధాన్ని నిజం చేసేందుకు ఈ కుట్రకు తెరలేపారని తేల్చి చెప్పారు.
Latest News