![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:42 PM
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఒక దుర్ఘటనలో, ప్రియురాలి మరణంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆమె చితిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో కలత చెందిన ప్రియుడు మద్యం సేవించి, మత్తులో ఆమె చితిలో దూకేందుకు యత్నించాడు.
అక్కడున్న వారు అతన్ని అడ్డుకుని, దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కామలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.