![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:36 AM
వివాహిత ప్రాణం తీసిన అక్రమ సంబంధం . 13 సార్లు కత్తితో పొడిచి వివాహితను హత్య చేసిన టెక్కీ ప్రియుడు. బెంగుళూరు బాణశంకరి పరిధిలోని హేమ్మిగేపుర ప్రాంతంలో నివసించే హరిని (33) అనే మహిళకు, 2012 లో దేసేగౌడ (41) అనే రైతుతో వివాహం కాగా, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు . మూడేళ్ల క్రితం ఒక జాతరలో యహాస్ (25) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారి, తరచూ యహాస్ ను కలుస్తున్న హరిని. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వగా, యహాస్ ను కలవడం ఆపేసిన హరిని. ఈ నెల 6వ తేదీన చివరిగా ఒకసారి కలుద్దాం అని నిర్ణయించుకొని, ఒక హోటల్ రూమ్ లో కలుసుకున్న యహాస్, హరిని కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల మరోసారి కలవలేనని చెప్పడంతో, తనతో తెచ్చుకున్న కత్తితో హరినిని 13 సార్లు పొడిచి హత్య చేసిన యహాస్. వివాహేతర సంబంధం ముగించడం ఇష్టం లేదని, అందుకే హత్య చేశానని విచారణలో పేర్కొన్న యహాస్
Latest News