![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:59 PM
అధికారం ఎవరికి శాశ్వతం కాదని కొమ్ముకాసే అధికారులు గుర్తించుకోవాలని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. సోమవారం పులివెందుల సబ్ జైల్లో ఉన్న వైయస్ఆర్సీపీ నాయకులను రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `వైయస్ఆర్ విగ్రహానికి కట్టిన జెండాలను తొలగించినందుకే హత్యాయత్నం కేసులు పెట్టారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మట్కా, గ్యాంబ్లింగ్, జూదం, గంజాయి విచ్చలవిడిగా కూటమి నాయకులే అమ్ముతున్నారు. వారికి కొందరు పోలీసులు మద్దతు పలుకుతూ వైయస్ఆర్సీపీ వారిని వేధిస్తున్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని కొమ్ముకాసే అధికారులు గుర్తించాలి. మీ రెడ్ బుక్ పరిపాలనకు ఇక్కడ ఎవరు భయపడేది లేదు. వచ్చేది మా ప్రభుత్వమే...మా పార్టీ కార్యకర్తలందరూ ప్రత్యేకంగా బుక్స్ రాస్తున్నారు. అక్రమంగా, అన్యాయంగా ఇబ్బంది పెట్టిన వారిని తప్పకుండా గుర్తుంచుకుంటాం` అంటూ రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు.
Latest News