![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:44 PM
డిబేట్లో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్సీపీకి ఆపాదిస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హోం శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనిత అసమర్థత కారణంగా రాష్ట్రంలో ప్రతి మూడు, నాలుగు గంటలకు ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతోందని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని హోంమంత్రి ఇతరులకు విలువలను నేర్పుతానని బీరాలు పలకడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా హోంమంత్రిగా రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన అనితకు ఇతరులకు విలువలు నేర్పే స్థాయి, అర్హత ఉందా అని ప్రశ్నించారు.
Latest News