![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 03:28 PM
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రెండు అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన బంగాళాఖాతంలో మొదటి అల్పపీడన, ఆ తర్వాత 14న రెండో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Latest News