![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 05:09 PM
కడప జిల్లా వ్యాప్తంగా విద్యను వ్యాపారంగా మార్చుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా విమర్శించింది.
శనివారం కడప నగరంలో జరిగిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లు మండిపడ్డారు. చదువు పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆర్థికంగా మోసం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అభినయ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.