వెంకటేశ్‌ అయ్యర్‌ ఆటతీరుపై కోల్‌కతా కెప్టెన్ రహానె స్పందన
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 07:07 PM

ఐపీఎల్‌లో ఒక ఆటగాడికి లభించే ధర, మైదానంలో ఆ ఆటగాడు కనబరిచే ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపదని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో తమ జట్టు వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో రహానె ఈ వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్‌‌కు మద్దతుగా నిలిచాడు.గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు, ఈ ప్రస్తుత సీజన్‌లో మాత్రం ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. ముఖ్యంగా, మెగా వేలంలో రూ.23.75 కోట్లు భారీ మొత్తానికి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్, ఈ సీజన్‌లో కేవలం 142 పరుగులు మాత్రమే చేసి, 20.28 సగటుతో నిరాశపరిచాడు.దీనిపై రహానె మాట్లాడుతూ, "ఒక ఆటగాడికి రూ.20 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చారని ఎవరూ రెట్టింపు కష్టపడరు. అలాగే, రూ.కోటి, రూ.2 కోట్లు లేదా రూ.3 కోట్లు మాత్రమే తీసుకుంటున్నామని ఏ ఆటగాడూ మ్యాచ్‌ను తేలికగా తీసుకోరు. మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లందరి ప్రవర్తన ఒకేలా ఉంటుంది, అదే ముఖ్యం" అని స్పష్టం చేశాడు.వెంకటేశ్ అయ్యర్ గురించి ప్రస్తావిస్తూ, "ఒక ఆటగాడిగా మన నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి సారిస్తాం. వెంకటేశ్ అయ్యర్ కూడా అదే విధంగా దృష్టి సారించాడు. అతని ప్రవర్తన చాలా బాగుంది. ప్రదర్శనలో ఒడిదొడుకులు అనేవి ఏ ఆటగాడికైనా సహజమే. దీనికి ఆటగాడి ధర కారణం కాదు. ధర గురించి అతను ఆలోచిస్తాడని నేను అనుకోవడం లేదు" అని రహానె తెలిపాడు.ఈ సీజన్‌లో కోల్‌కతా జట్టు వైఫల్యాలపై కూడా రహానె స్పందించాడు. గతేడాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా ఈసారి ఆశించిన మేర రాణించలేకపోయారు. దీనిపై రహానె మాట్లాడుతూ, "ఒక ఛాంపియన్‌షిప్‌ను గెలవడం, ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. జట్టుగా మేం మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ కొన్నిసార్లు వైఫల్యాలు తప్పలేదు. వచ్చే సీజన్‌కు మరింత బలంగా తిరిగి వస్తాం" అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM