వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా.. జీవో జారీ
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 06:22 PM

ఆంధ్రప్రదేశ్‌ వాసులకు గమనిక. రాష్ట్రంలో ఓ జిల్లా పేరు మారింది. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ జీవో విడుదలైంది. మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు.


అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ఆర్ కడప జిల్లాలో నుంచి కడప పేరును తొలగించింది. వైఎస్సార్‌ జిల్లాగా మార్చింది. అయితే ఈ మార్పుపై గతంలో ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. దేవుని గడపగా పిలిచే కడప పేరును జిల్లా పేరులో కొనసాగించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే అప్పట్లో కడప జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తాము అధికారంలోకి వస్తే పేరు మారుస్తామని హామీ ఇచ్చారు. ఇక 2024 ఏపీ ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ కూడా ఈ విషయమై పలుమార్లు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కడప చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సత్యకుమార్ లేఖ కూడా రాశారు.


కడప జిల్లాలోని దేవుని కడప ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిగా కొలువై ఉన్నారని.. దేవుని కడప ఆలయ విశిష్టతను సత్యకుమార్ యాదవ్ లేఖలో ప్రస్తావించారు. పూర్వం రోజుల్లో ఈ ప్రాంతంలో కృపాచార్యులు బస చేశారని, అలాగే శ్రీవారి సాక్షాత్కారం పొందారని అందులో వివరించారు. కృపాచార్యులు శ్రీవారి కృప పొందిన ఈ ప్రాంతానికి కృపావతిగా నామకరణం చేశారని.. ఆ కృపావతి కాలక్రమంలో కుడపగా.. ఆ తర్వాత క్రమేపి కడపగా మారినట్లు సత్యకుమార్ చంద్రబాబుకు రాసిన లేఖలో వివరించారు. అలాగే తిరుమలకు వెళ్లలేని వారి కోసం ఇక్కడ శ్రీవారి రూపాన్ని ప్రతిష్టించారని వివరించారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న కడప పేరును వైసీపీ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో మార్చిందన్న సత్యకుమార్.. ఈ నిర్ణయంతో శ్రీవారి భక్తులు బాధపడ్డారని అన్నారు.


అలాగే కడప జిల్లా అభివృద్ధికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషిచేశారని.. వైఎస్ఆర్ కృషిని, కడప చారిత్రక ప్రాశస్త్యాన్ని పరిగణనలోకి తీసుకుని వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చాలని నిర్ణయం తీసుకోగా.. ఆ నిర్ణయం ఆధారంగా తాజాగా గెజిట్ విడుదలైంది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM