కూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని కుటుంబం మొత్తం ఆత్మహత్య
 

by Suryaa Desk | Sun, May 25, 2025, 07:38 PM

మించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కుటుంబం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులతో పాటు మరో కుమార్తె కూడా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే.. మైసూరుకు చెందిన మహాదేవస్వామి, మంజుల దంపతులకు అర్పిత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ పిల్లలను బాగా చదివించి, ఉన్నత స్థాయిలో చూడాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అయితే, వారి పెద్ద కుమార్తె అర్పిత ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. పెద్దల మాటలను లెక్కచేయని అర్పిత, తాను ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు, చెప్పాపెట్టకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన మహాదేవస్వామి, మంజుల దంపతులు తమ చిన్న కుమార్తె హర్షితతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నవారి ఆశలను కాదని కూతురు తీసుకున్న నిర్ణయం, చివరకు ఆ కుటుంబంలోనే తీవ్ర విషాదాన్ని నింపింది.

Latest News
Bangladesh suicide rates surge in 2020-24, 40 people died daily Tue, Dec 23, 2025, 04:09 PM
EAM Jaishankar meets Lankan ministers, reiterates India's full support Tue, Dec 23, 2025, 04:04 PM
Resolving Delhi's inherited problems on all fronts: CM Rekha Gupta Tue, Dec 23, 2025, 03:55 PM
Free trade pact with New Zealand India's first women-led FTA: PM Modi Tue, Dec 23, 2025, 03:52 PM
CM Stalin writes to EAM after Sri Lankan Navy arrests 12 TN fishermen Tue, Dec 23, 2025, 03:47 PM