మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడి ఇంటిని కూల్చేసిన గ్రామస్థులు
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 07:28 PM

కడప జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన మూడేళ్ల బాలికపై రహమతుల్లా అనే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపి.. ముళ్లపొదల్లోకి పడేశాడు. శుక్రవారం రోజున జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో కోపం కట్టలు తెచ్చుకుంది. నిందితుణ్ని చితకబాదిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసిన రహ్మతుల్లా ఇంటిని స్థానికులు కూల్చివేశారు. జేసీబీ సాయంతో అతని ఇంటిని కూల్చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామస్తులు చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజనం ప్రశంసలు కురిపిస్తున్నారు. రహ్మతుల్లా పదోతరగతి వరకు చదువుకున్నాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసగా మారినట్లు స్థానికులు చెప్తున్నారు. మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్తున్నారు. రహమతుల్లా తల్లి కువైట్‌లో ఉండగా.. తండ్రి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు.


బంధువుల పెళ్లి ఉందంటే ప్రొద్దుటూరుకు చెందిన ఓ కుటుంబం తమ మూడేళ్ల చిన్నారితో కలిసి మైలవరం మండలంలోని ఓ గ్రామానికి వచ్చారు. అయితే చర్చి వద్ద అందరూ పెళ్లి హడావిడిలో ఉన్న సమయంలో.. రహమతుల్లా బాలికను ఆడిస్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లి చిన్నారి నోట్లో అరటి పండు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఎవరికైనా తెలుస్తుందనే భయంతో చిన్నారిని చంపేసి వెనుక ఉన్న ముళ్లపొదల్లో పడేసి ఏమీ ఎరగనట్లు వచ్చేశాడు. అయితే చిన్నారి కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బాలిక తల్లిదండ్రులతోపాటు బంధువులు అందరూ చర్చి చుట్టుపక్కల వెదకడం ప్రారంభించారు.


ఈ క్రమంలోనే కొంతమందికి రహమతుల్లా చొక్కా మీద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు గట్టిగా నిలదీయటంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు రహమతుల్లాను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఇంతలోనే మరికొంతమందికి ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే నిందితుణ్ని తమకు అప్పగించాలని బాలిక కుటుంబసభ్యులు శుక్రవారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. శనివారం నిందితుడి ఇంటిని స్థానికులు కూల్చివేశారు.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM