![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 07:20 PM
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీమోహన్ను పేర్ని నాని శనివారం ఉదయం పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వల్లభనేని వంశీని ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్ పతనానికి వంగవీటి రంగా మరణం కారణమైన మాదిరిగానే వల్లభనేని వంశీకి ఏమైనా జరిగితే వంశీ మరణమే టీడీపీ ప్రభుత్వాన్ని బలి తీసుకుంటుందంటూ పేర్ని నాని హెచ్చరించారు.
Latest News