మయన్మార్‌ లో విషాదం, రెండు పడవలు బోల్తా, 427 మంది మృతి
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 05:40 PM

మయన్మార్‌ లో విషాదం, రెండు పడవలు బోల్తా, 427 మంది మృతి

మయన్మార్‌ తీర ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘోర దుర్ఘటనల్లో సుమారు 427 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వార్త నిజమైతే, ఇటీవలి కాలంలో సముద్రంలో జరిగిన అతి పెద్ద విషాదాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని ఐరాస పేర్కొంది.ఐక్యరాజ్య సమితి అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మే 9వ తేదీన జరిగిన మొదటి ప్రమాదంలో ఒక నౌక మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 267 మందిలో కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడి ఉంటారని తెలిపింది. మిగిలిన వారు గల్లంతయ్యారు.ఆ తర్వాత మే 10వ తేదీన మరో నౌక కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురైంది. ఈ రెండో నౌకలో ఉన్న వారిలో 21 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరారని సమాచారం. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 427 మంది మరణించి ఉండవచ్చని ఐరాస అంచనా వేస్తోంది. ఈ ప్రమాదాలకు గల కచ్చితమైన కారణాలపై ఐరాసకు అనుబంధంగా పనిచేస్తున్న శరణార్థి విభాగం విశ్లేషణ జరుపుతున్నట్లు సమాచారం.

Latest News
Gujarat: Bomb threat at Veraval court; premises evacuated, no explosives found Mon, Jul 07, 2025, 04:55 PM
Fuel ban suspension: Delhi govt to inform SC about public inconvenience, AAP's lapses Mon, Jul 07, 2025, 04:54 PM
'Water treatment plants in UP have been shut down': Akhilesh Yadav slams govt over river pollution Mon, Jul 07, 2025, 04:45 PM
Chhattisgarh EOW submits charge sheet in multi-crore liquor scam Mon, Jul 07, 2025, 04:19 PM
Sajjan Kumar pleads innocence in 1984 riots cases Mon, Jul 07, 2025, 04:17 PM