అస్వస్థతకు గురైన పీఎస్సార్ ఆంజనేయులు
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 04:57 PM

అస్వస్థతకు గురైన పీఎస్సార్ ఆంజనేయులు

ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు, ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. జత్వానీ కేసులో ఆయన రిమాండ్ ను విజయవాడ కోర్టు వచ్చే నెల 4వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు జైల్లో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. బీపీ స్థాయులు పడిపోవడంతో ఆయనను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో నిన్న ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఈ ఫామ్ హౌస్ లోనే గత నెల 22న ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Latest News
Kanishka bombing anniversary: EAM reiterates call for zero tolerance to terrorism, extremism Mon, Jun 23, 2025, 11:29 AM
Hanwha Systems joins Northrop Grumman to build advanced air defence systems Mon, Jun 23, 2025, 11:21 AM
Assembly bypolls result: Cong consolidates lead in Nilambur, Left and BJP trail Mon, Jun 23, 2025, 11:19 AM
France expresses concern after US strikes nuclear sites in Iran Sun, Jun 22, 2025, 06:24 PM
SpiceJet asked to pay Rs 25,000 to senior citizen for issuing wrong ticket Sun, Jun 22, 2025, 06:22 PM