![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 01:15 PM
కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ, కారు ఢీకొన్న ఘటన బాధాకరమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. నలుగురి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయని.. ప్రయాణికుల రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రయాణాలలో భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.కాగా, దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. శుక్రవారం నాడు సైతం ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టగా.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. అతి వేగంతో ఎంతో మంది కుటుంబసభ్యులకు దూరమవుతున్నారు. అప్పటివరకూ తమతో మాట్లాడిన వారు ఇలా రోడ్డుప్రమాదాల బారిన పడి మృత్యుఒడిలోకి వెళ్లడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Latest News