![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 12:07 PM
కొవ్వూరు స్థానిక ఆర్టీసీ డిపో వద్ద సిబ్బంది శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసేలా 2019 సర్క్యూలర్ ను యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఈ సర్క్యులర్ ను నిర్వీర్యం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు అవస్థలు పడ్డారన్నారు. ఉద్యోగుల హక్కులను సాధించడమే లక్ష్యంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పనిచేస్తుందని అసోసియేషన్ కొవ్వూరు డిపో సెక్రటరీ శివ అన్నారు.
Latest News