![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 12:04 PM
మయన్మార్ తీరంలో జరిగిన వరుస పడవ ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీన 267 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ మునిగిపోవడంతో 201 మంది మరణించగా, మరుసటి రోజు 247 మందితో వెళ్తున్న మరో పడవ ప్రమాదానికి గురై 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 87 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
2024 సంవత్సరంలో మయన్మార్ తీరంలో ఇలాంటి ప్రమాదాల్లో మొత్తం 657 మంది మరణించినట్లు UNHCR తెలిపింది. ఈ ఘటనలు రోహింగ్యా శరణార్థుల దుర్భర పరిస్థితులను మరోసారి బయటపెడుతున్నాయి.