![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 07:27 PM
తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్ భక్తుడు రూ.17 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్.. టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు. శుక్రవారం రోజున శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో శ్రీవారి భక్తులకు ఒక పూట మధ్యాహ్నం భోజనం అందించేందుకు ఉపయోగించాలని టీటీడీని దాత సత్య రోహిత్ కోరారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.
తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఏవో శ్యామలరావు శుక్రవారం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తిరుమలలోని సహజ శిలా తోరణం, చక్ర తీర్థాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ ప్రాంతాలలోని పార్కింగ్, శుభ్రత వంటి అంశాలను టీటీడీ ఈవో శ్యామలరావు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం చక్ర తీర్థం రాతి కొండలోని సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను, శివుని సాన్నిధ్యాన్ని కూడా శ్యామలరావు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆ ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ ఏవో శ్యామలరావుతో పాటుగా ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూధన్, టిటిడి అటవీ శాఖ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వేసవి సెలవులు కావటంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. గురువారం రోజున రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి శుక్రవారం క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం వేకువజామున దర్శన క్యూలైన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీశారు.టీటీడీ సిబ్బంది సేవలు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
Latest News