![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 04:01 PM
ధర్మవరం పట్టణంలోని శివానగర్కు చెందిన లలిత (56) అనే మహిళ శుక్రవారం ధర్మవరం చెరువు రెండో మరవలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి భర్త గోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, లలిత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, ఆత్మహత్య చేసుకుంటానని తరచూ చెప్పేదని తెలిపారు.
ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చెరువు వద్దకు వెళ్లి, అక్కడ దూకి మృతి చెందినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.