![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 03:54 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇటీవల లిక్కర్ స్కామ్ విషయంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, "జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయం" అని పేర్కొన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆదినారాయణరెడ్డి, "లిక్కర్ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చాలాసార్లు ప్రస్తావించారు. లిక్కర్ ఒప్పందాలపై నా సంతకం ఉందా? అని జగన్ ప్రస్తావించడంలో అర్ధం లేదు. ఆయనకి ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపే నైతిక హక్కు లేదు" అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల అర్బన్ లిక్కర్ పాలసీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసులో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాల్సిందే.