![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 03:04 PM
ఏపీలో కొత్తగా ఎయిర్పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి.కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంట్ స్థాయి మినీ మహానాడులో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తన పనితీరును ప్రధాని మోదీ, రాష్ట్రానికి తెస్తున్న నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గమనిస్తున్నారని అందుకే ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రిగా తనకు అవకాశం ఇచ్చారన్నారు రామ్మోహన్నాయుడు. పరుగులు శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలో విమానాశ్రయాలు త్వరలో ప్రారంభిస్తామన్నా రామ్మోహన్ నాయుడు. మరో మూడు చోట్ల కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది అన్నారు. అమరావతికి రూ.48 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.10,500 కోట్లు తీసుకురాగలిగామని, రైల్వే జోన్ కు శంకుస్థాపన కూడా చేశామన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. సంక్షేమం- అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. 'ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ రెండు నగరాల మధ్య విమాన రాకపోకలు ఉంటాయి. ఈ విమాన సేవల ద్వారా రాష్ట్రంలో అంతర్గతంగా కనెక్టివిటీ పెరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఇది కీలకంగా మారనుంది' అన్నారు. విమాన సర్వీసు జులై 2వ తేదీ నుంచి కర్నూలు నుంచి విజయవాడకు విమాన సేవలు ప్రారంభమవుతాయని ఏపీ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రస్తుతం సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఈ సర్వీసు నడుస్తుండగా త్వరలోనే ప్రతి రోజూ ఈ విమాన సర్వీసు నడుపుతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినట్లు తెలియజేశారు. ప్రతిరోజూ కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసు అందుబాటులోకి రావడం శుభపరిణామం అన్నారు మంత్రి భరత్.
Latest News