![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:54 PM
విశాఖలో వివాహితకు కరోనా పాజిటివ్ అని తేలింది. మద్దెలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వివాహిత చలి జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షల్లో కోవిడ్ 19గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు కేజీహెచ్లో మరోసారి శాంపిల్ను పరీక్షించగా అది కూడా పాజిటివ్ గానే నిర్ధారణ అయ్యింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండగా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా హోం ఐసోలేషన్లో ఉంచారు. ఆ వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మద్దెలపాలెంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. వివాహిత కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి కేజీహెచ్కు పంపించారు. వారందరూ కూడా హోం ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా.. ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గ్రూప్గా ఉన్న చోట తిరగవద్దు అంటూ పలు ఆదేశాలను ఈనెల 21నే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చింది.
Latest News