![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:10 PM
తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. ఈనెల 27 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రెండు రోజుల్లో అల్పపీడనం బలపడనుందని, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. ఈ సమయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. ఆదివారం అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఆదివారం నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
Latest News