![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:36 PM
సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. గురువారం సాయంత్రం 4గంటలకు భక్తులతో బయలుదేరినట్లు ఆర్టీసీ డీఎం ఎస్కే షబ్నం తెలిపారు. రాజమండ్రి, అమలాపురం తదితర ప్రధాన ఆర్టీసీ డిపోల నుంచి సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారికి భారీ ఆఫర్ ప్రకటించింది. ఒకే టికెట్తో తెలంగాణలోని ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు సరస్వతి పుష్కర పుణ్యస్నానం ఆచరించేందుకు అవకాశం కల్పించింది. మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా రాజమండ్రి నుంచి బయలుదేరే బస్సు... సరస్వతి పుష్కరాలతో పాటు కాళేశ్వరం ఆలయ దర్శనం, ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, త్రివేణి సంగమంలో పుష్కరస్నానం అనంతరం కొండగట్టులో ఆంజనేయస్వామి, వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి, వరంగల్లో భద్రకాళీమాత, రామప్పలో రామప్ప దేవాలయాలను దర్శించుకునే సదుపాయాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. అనంతరం తిరిగి గమ్యస్థానానికి చేర్చనున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
Latest News