ఉన్న భవనాలు చాలవన్నట్లు క్రొత్త సచివాలయానికి అంత స్థలం ఎందుకు?
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 03:57 PM

అమరావతిలో తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు సరిపడా ఉన్నప్పటికీ, 53 లక్షల చదరపు అడుగుల పైచిలుకు విస్తీర్ణంతో కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏముందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనవసరపు వ్యయంతో పాటు, కాంట్రాక్టులు కట్టబెట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడానికే ఈ భారీ నిర్మాణాలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు.ప్రస్తుతం తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం ఆరు బ్లాకుల్లో సుమారు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాలు, సచివాలయంలోని సిబ్బంది మొత్తం కలిపినా 12 వేల మందికి మించి లేరని, వారంతా ఇప్పటికే ఉన్న 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు, కొత్తగా 53 లక్షల 57 వేల 389 చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఏముందని ఆయన నిలదీశారు. "సిబ్బంది సంఖ్య పెరగనప్పుడు, ఇంత భారీ విస్తీర్ణం ఎందుకు? ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోవా?" అని జగన్ ప్రశ్నించారు.

Latest News
41 Maoists, including 39 from Chhattisgarh, surrender before Telangana Police Fri, Dec 19, 2025, 04:56 PM
India-Oman free trade pact likely to become operational within 3 months: Piyush Goyal Fri, Dec 19, 2025, 04:55 PM
Hanwha Ocean wins $1.75 billion order for 7 LNG carriers from Europe Fri, Dec 19, 2025, 04:49 PM
EAM Jaishankar and Netherlands counterpart discuss bilateral ties, global issues Fri, Dec 19, 2025, 04:46 PM
Odds are slim, fight until last ball: Hussain says England 'need miracle' to keep Ashes hopes alive Fri, Dec 19, 2025, 04:38 PM