![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:20 PM
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత నేను తీసుకుంటా, ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటా’ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. లోకేశ్ను కలిసిన వారిలో బాలకోటిరెడ్డి భార్య నాగేంద్రమ్మ, సోదరుని కుమారులు నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. బాలకోటిరెడ్డిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని వారు లోకేశ్ను కోరారు. తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహ నిర్మాణం బిల్లులు పెండింగ్లో ఉండటంతోపాటు తమ ఇల్లు కూడా తాకట్టులో ఉందని తెలిపారు. లోకేశ్ మాట్లాడుతూ బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని, పెండింగ్ బిల్లులు చెల్లించి, తాకట్టు నుంచి ఇంటిని విడిపిస్తానని హామీ ఇచ్చారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Latest News