ఘనంగా ముగిసిన సాలూరు గ్రామదేవత ఉత్సవాలు
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 01:23 PM

ఘనంగా ముగిసిన సాలూరు గ్రామదేవత ఉత్సవాలు

సాలూరు గ్రామదేవత శ్యామలాంబ అమ్మ వారి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 18న ఉయ్యాల కంబాలతో ఉత్సవాలు ప్రారంభయ్యాయి. 19న తోలెళ్లు, 20న సిరిమానోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. బుధవారం అనుపోత్సవంతో అమ్మవారి పండుగ ముగిసింది. బుధవారం వేకువజామున 3 గంటలు దాటిన తరువాత సిరిమాను, అంజలి రథం, ఘటాలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నాయి. ఈ ఉత్సవాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అంతా తానై నడిపారు. మూడు నెలలుగా అన్ని శాఖల అధికారులను సమావేశపరచి, వారిని సమన్వయం చేసుకుంటూ పండుగ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ రాంబాబు, సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ ఎంతగానో శ్రమించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో యంత్రాంగంతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తపరిచారు. 

Latest News
Delhi CM pays tribute to Kanishka bombing victims; calls for zero tolerance for terror Mon, Jun 23, 2025, 02:07 PM
KL Rahul's style and technique are tailor-made for English conditions: Nick Knight Mon, Jun 23, 2025, 01:43 PM
Let's see what they do, says D.K. Suresh ahead of appearance before ED in Aishwarya Gowda case Mon, Jun 23, 2025, 01:38 PM
Syama Prasad Mookerjee's sacrifices teach commitment towards nation, says MP CM Mon, Jun 23, 2025, 01:29 PM
Bihar engineer goes missing in Iran amid military conflict, family appeals to Indian govt for safe return Mon, Jun 23, 2025, 12:54 PM