![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 01:00 PM
వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై ఆళ్లగడ్డలో కేసు నమోదు అయింది. ఎర్రగుంట్లకు చెందిన నాగ ప్రసాద్ ఫిర్యాదు నేపథ్యంలో భూమా కిషోర్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాంసం దుకాణాల నుంచి కేజీ చికెన్పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఖండించారు. అంతేకాదు మీడియా ముందుకు వచ్చి ఆమె వివరణ సైతం ఇచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ గ్రూప్ల మధ్య స్థానికంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఉద్రిక్త పరిస్థితులకు వైసీపీ వర్గీయులు కారణమవుతున్నారంటూ నాగ ప్రసాద్, పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అతడి అనుచరులు అంబటి మహేశ్వర్ రెడ్డి ,శివ శంకర్ రెడ్డి, మల్లికార్జున్, రుద్ర శివ నాగిరెడ్డి, ప్రతాపరెడ్డి ,అంబటి చంద్రశేఖర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News