![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 12:25 PM
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అత్యవసర సమయంలో ప్రజలు 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు.