ఆర్మీ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురి మృతి
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 07:38 PM

 పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఇతర దౌత్యపరమైన చర్యలతోనే దాయాది దేశం చుక్కలు చూస్తోంది. ఇండియా చేసిన క్షిపణి దాడులకు ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. మరోవైపు బలూచిస్థాన్ కూడా తమ సొంత దేశమైన పాక్‌పైనే తరచుగా దాడులు చేస్తూ.. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తోంది. అయితే తాజాగా బలూచిస్థాన్‌యే మరో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ కారులో ఆత్మాహుతి బాంబు పెట్టి పంపించగా.. ఆ కారు ఆర్మీ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఫలితంగా నలుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 38 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. బలూచిస్థాన్ కుజ్‌దార్ ప్రావిన్సులో ఈ దారుణం చోటు చేసుకుంది.


పాకిస్థాన్‌లోని ఓ ఆర్మీ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో నలుగురు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా.. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ కాకుండా మొత్తంగా 42 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బలూచిస్థాన్ కుజ్‌దార్ ప్రావిన్సులో ఈ దారుణం చోటు చేసుకోగా.. అక్కడి ఓ స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి అనే సీనియర్ దీని గురించి మీడియాకు వెల్లడించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు.. పిల్లలను తీసుకు వస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిందన్నారు. అయితే ఈ దాడిలో ఓ కారును ఆత్మాహుతి కోసం వాడినట్లు వివరించారు. అంతా పథకం ప్రకారమే చేశారని.. కారు వచ్చి బస్సును ఢీకొట్టగానే వాహనం పూర్తిగా ధ్వంసం అయిందని చెప్పారు.


విషయం గుర్తించిన స్థానికులు పిల్లలను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారని వెల్లడించారు. ఆలోపే పోలీసులు, అంబులెన్సులకు కూడా సమాచారం అందించారన్నారు. దీంతో రంగంలోకి దిగిన అంబులెన్సులు.. మృతదేహాలు సహా 38 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే


ముఖ్యంగా పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి మొహసీన్ నఖ్వీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పిల్లలపై దాడి చేసిన వారు నరరూప రాక్షసులు అని అభివర్ణించారు. అయితే ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ అందరూ బలూచిస్థాన్‌లోని వేర్పాటువాద గ్రూపులే ఈ పని చేసి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బలోచిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహించే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)యే ఈ పని చేసి ఉంటుందని పలువురు చెప్పుకొస్తున్నారు. BLA 2019లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ద్వారా ఉగ్రవాద సంస్థగా గుర్తించబడింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితమే బలూచిస్థాన్ లోని ఖలిల్లా అబ్ధుల్లా అనే ప్రాంతంలో కారు బాంబు పేలడంతో నలుగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రదేశం అఫ్గాన్ సరిహద్దుల్లో ఉంటుంది.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM