మారిన బెంగళూరు, సన్ రైజర్స్ మ్యాచ్‌ వేదిక
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 04:50 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. మే 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ లక్నోకు మార్చింది.భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో బెంగళూరులోని క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. సొంత గడ్డపై తమ జట్టు ఆటను చూడలేకపోతున్నామని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 23వ తేదీ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. మ్యాచ్ వేదిక మార్పుతో బెంగళూరులోని అభిమానులు నిరాశ చెందుతున్నారు.ఐపీఎల్ పునరుద్ధరణ తర్వాత మే 17న జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. టాస్ కూడా వేయకముందే భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ దిగులుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

Latest News
Rupee slips past 95 against US dollar amid crude spike Thu, Apr 30, 2026, 10:29 AM
Internet major Naver’s Q1 net profit falls 31.3 pct on forex losses Thu, Apr 30, 2026, 10:25 AM
Trump blasts Powell over decision to stay on as Fed governor Thu, Apr 30, 2026, 10:17 AM
Putin calls for building nuclear-weapon-free world Thu, Apr 30, 2026, 10:12 AM
IMD predicts moderate to heavy rain across Western Ghats, South TN Thu, Apr 30, 2026, 10:07 AM