|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:40 PM
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ఎలాంటి గగనతల రక్షణ తుపాకులు గానీ, ఇతర రక్షణ వ్యవస్థలను గానీ మోహరించలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. పాకిస్థాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, వాటిని ఎదుర్కొనేందుకు సైన్యం స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకులను అమర్చిందని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కథనాలను సైన్యం తోసిపుచ్చింది."స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ (ఏడీ) తుపాకుల మోహరింపునకు సంబంధించి కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీ దర్బార్ సాహిబ్ అమృత్సర్ (స్వర్ణ దేవాలయం) ప్రాంగణంలో ఎలాంటి ఏడీ తుపాకులు లేదా ఇతర ఏడీ వనరులను మోహరించలేదని స్పష్టం చేస్తున్నాం" అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
Latest News